తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. సినీ ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. తమన్నా తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజనీ భాటియాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
'గత వారాంతం నుంచి నా తల్లిదండ్రుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయి.. దీంతో కుటుంబ సభ్యులు అందరం కరోనా టెస్టులు చేయించుకున్నాం. ఫలితాల్లో దురదృష్టవశాత్తూ అమ్మనాన్నలకు పాజిటివ్ వచ్చింది. నాతో సహా ఇతర కుటుంసభ్యులు, సిబ్బందికి మాత్రం నెగెటివ్గా తేలింది. ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. అందరి ప్రార్థనలు వారిని తొందరగా కోలుకునేలా చేయాలని కోరుకుంటున్నా' అని తమన్నా పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com