Tirumala : శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

X
By - Vijayanand |26 Jan 2023 6:05 PM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ. కాబోయే భార్యతో కలిసి ఆయన స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాల తర్వాత తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు పట్టువస్తాలతో సత్కరించారు.
అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్ కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే కామాఖ్య ఆలయం, పూరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తిరుమలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com