TS : హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

TS : హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. టెన్త్‌ క్లాస్ పేపర్ లీక్ కేసులో.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. పేపర్ లీక్ ఘటనపై కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే కేసులో అరెస్ట్‌ అయిన సంజయ్.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story