Viveka Murder Case : వివేకా హత్య కేసులో జగన్ కు భయం పట్టుకుంది : బీటీ నాయుడు
By - Vijayanand |23 April 2023 12:59 PM GMT
వివేకా హత్యకేసులో జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీ టీ నాయుడు. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసుల వచ్చినపుడల్లా జగన్ కు భయం పట్టుకుంటుందన్నారు. ఆధోని ఎమ్మెల్యే, సాయి ప్రసాద్ రడ్డి, ఆయన కుమారుడు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, లేదా పొలిటికల్ జేఏసీకి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాల చిట్టాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సర్వే నెంబర్ 352 లోని భూములు, అస్పరీ రోడ్డులోని భూములను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొల్ల గొడితే.. ఆదోని చుట్టు పక్కల ఉండే కొండల్ని సైతం దోచేసుకున్నారన్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com