ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయనున్న టిక్‌టాక్

ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయనున్న టిక్‌టాక్
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును అశ్రయించనుంది.

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును అశ్రయించనుంది. అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. టిక్‌టాక్ విషయంలో తమ సంస్థ ప్రభుత్వంలో చాలా వరకు చర్చల ద్వారా సమస్యను పరిస్కరించుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది. అయితే, అమెరికా ప్రభుత్వం మాత్రం వాస్తవాలను పక్కనపెట్టి టిక్‌టాక్ బ్యాన్ చేసిందని అన్నారు. కానీ, బ్యాన్ చేసేటప్పుడు చట్టపరంగా అనుసరించాల్సిన విధివిధానాలేవి పట్టించుకోలేదని ఆరోపించింది. దీంతో, తాము కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తమ కంపెనీ వినియోగదారులకు న్యాయం చేయాలంటే.. తమ ముందున్న మార్గం అదొక్కటే అని బైట్ డ్యాన్స్ తెలిపింది. ఆగస్టు 24న కోర్టును ఆశ్రయిస్తామని స్ఫష్టం చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలపై శ్వేత శౌధం అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story