బీజేపీ కార్యాలయంలో కరోనా

X
By - Admin |23 Aug 2020 4:43 PM IST
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి కరోనా ప్రవేశించింది. కార్యాలయ సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి కరోనా ప్రవేశించింది. కార్యాలయ సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో 40 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో పార్టీ ఆఫీసులో కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆఫీస్ మొత్తాన్ని శానిటైజేషన్ చేస్తున్నారు. కోవిడ్ సోకిన వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com