భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ముష్కరులు హతం

భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ముష్కరులు హతం
ఐదుగురు సాయుధ పాకిస్థాన్‌ చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు హతమార్చారు.

భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఐదుగురు సాయుధ పాకిస్థాన్‌ చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్చి చంపారు. ఈ ఘటన ద్రాల్‌ సరిహద్దు పోస్ట్‌ సమీపంలో చోటుచేసుకుంది.

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భారత భూభాగంలోకి ఐదుగురు ముష్కరులు చొరబడ్డారు. దీంతో చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు హతమార్చారు. చొరబాటుదారుల నుంచి 9.92 కిలోల హెరాయిన్‌, ఒక ఏకే-47 రైఫిల్‌, రెండు మ్యాగజైన్లు, 27 రౌండ్ల బుల్లెట్లు, నాలుగు 9ఎంఎం బెర్రెట్ట పిస్టళ్లు, రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.610 పాక్‌ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఇంతమంది పాక్‌ జాతీయులు భారత్‌లోకి చొరబడటం ఇదే తొలిసారి అని బీఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story