మృత్యుంజయుడు.. 20 గంటల పాటు సజీవంగా శిథిలాల కింద

మృత్యుంజయుడు.. 20 గంటల పాటు సజీవంగా శిథిలాల కింద
మహారాష్ట్రలో ఓ ఐదంతస్తుల భవనం సోమవారం కుప్పకూలిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో ఓ ఐదంతస్తుల భవనం సోమవారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భవనం శిథిలాల కింద సుమారు 75 మంది వరకూ చిక్కుకున్నారు. ఇందులో పలువురు చిక్కుకోగా.. సుమారు 60 మందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించారు. అయితే, తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ దాళాలు కాపాడారు. సుమారు 20 గంటల పాటు శిథిలాల క్రింద సజీవంగా ఉండి.. చివరికి రక్షక బటుల చేతికి చిక్కాడా బాలుడు. దీంతో అంతా ఆ చిన్నారిని మృత్యుంజయుడు అంటున్నారు. మొత్తం మూడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. పన్నెండు అగ్నిమాపక దళాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story