ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పోరాటంపై నీళ్లు చల్లిన కేంద్రం
By - TV5 Telugu |24 Jun 2019 2:49 PM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటంపై నీళ్లు చల్లింది కేంద్రం. ఏ రాష్ట్రానికీ స్పెషల్ స్టేటస్ ఇవ్వబోమని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. బీహార్ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. చాలా రాష్ట్రాల నుంచి హోదా వినతులు వచ్చాయని.. ఎవ్వరికీ ఇవ్వడం కుదరదని ఆమె తేల్చి చెప్పారు. అదే సమయంలో పారిశ్రామిక రాయితీలకు, స్టేటస్కు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com