మహద్‌ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో కూలిన భవనం

మహద్‌ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో కూలిన భవనం
మహద్‌ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మధ్యప్రదేశ్‌లో భవనం కూలింది. దేవస్‌లో రెండతస్తుల భవనం కూలింది.

మహారాష్ట్రలోని మహద్‌లో సోమవారం ఐదంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది వరకు మృతి చెందారు. మహద్‌ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మధ్యప్రదేశ్‌లో భవనం కూలింది. మధ్యప్రదేశ్‌లోని దేవస్‌లో రెండతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించారు. మంగళవారం దేవస్‌లోని లాల్‌గేట్‌ సమీపంలో స్టేషన్‌ రోడ్డు వద్ద రెండు అంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ వారిని అధికారులు హాస్పిటల్‌కి తరలించారు. ఇంకా సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు.

Tags

Next Story