Hyderabad : సంగీత మాంత్రికుని స్వరాల విందు....

Hyderabad : సంగీత మాంత్రికుని స్వరాల విందు....
గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్; ఈ నెల 25, 26న...

స్వర మాంత్రికుడు ఇళయరాజా పేరు వినిపిస్తే చాలు సంగీత ప్రియుల్లో గాల్లో తేలిపోతుంటారు. స్వరాలతో ఎవ్వరినైనా మెస్మరైజ్‌ చేసేస్తారు. మెలోడీలతో మత్తెక్కిస్తాడు. గత ఆరు దశాబ్దాలుగా తన పాటలతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇళయరాజా 80వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఓ భారీ సంగీత విభావరికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్‌ టాకీస్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఎంతో మంది గాయనీ, గాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకకు దాదాపు 60వేల మంది వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story