Lingusamy: 'ది వారియర్' దర్శకుడికి ఆరు నెలల జైలు శిక్ష..

Lingusamy: ది వారియర్ దర్శకుడికి ఆరు నెలల జైలు శిక్ష..
Lingusamy: తిరుపతి బ్రదర్స్ అనే పేరుతో లింగుసామి, తన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌కు ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఉంది.

Lingusamy: సినీ పరిశ్రమలో చెక్ బౌన్స్ కేసులు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఎంత పెద్ద దర్శకులు అయినా, నిర్మాతలు అయినా పలు సందర్భాల్లో ఈ చిక్కుల్లో పడుతునే ఉంటారు. తాజాగా 'ది వారియర్' దర్శకుడు లింగుసామి ఈ కేసులో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా ఈ కేసులో అతడికి 6 నెలల జైలుశిక్ష కూడా విధించింది కోర్టు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

తిరుపతి బ్రదర్స్ అనే పేరుతో లింగుసామి, తన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌కు ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ.. 2014లో పీవీపీ క్యాపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుండి రూ.1.3 కోట్లు అప్పుగా తీసుకుంది. 'ఎన్ని ఎరు నాళ్' అనే టైటిల్‌తో ఈ సినిమాను లింగుసామి తెరకెక్కించాల్సి ఉంది. ఇందులో కార్తి, సమంత హీరోహీరోయిన్లుగా ఫైనల్ అయ్యారు కూడా. కానీ ఎందుకో ఈ చిత్రం పట్టాలెక్కలేదు.

దీంతో సినిమా కోసం తీసుకున్న డబ్బు కూడా తిరిగివ్వలేకపోయింది తిరుపతి బ్రదర్స్ సంస్థ. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది పీవీపీ క్యాపిటల్స్. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో లింగుసామి, తన సోదరుడు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామని అంగీకరించారు. కొన్నాళ్ల తర్వాత ఓ చెక్‌ను పీవీపీ క్యాపిటల్స్‌కు వారు అందజేశారు. కానీ ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో లింగుసామికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

ఈ కేసులో లింగుసామికి, తన సోదరుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ విషయంపై లింగుసామి తాజాగా ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు. ఇందులో కోర్టుకు తాను విజ్ఞప్తి చేశానని, ఏ సమస్య వచ్చినా లీగల్‌గానే ఎదుర్కుంటామని అందులో తెలిపాడు లింగుసామి. ఇక కొంతకాలంగా లింగుసామి ఫామ్‌లో లేడు. తెలుగులో తాను తెరకెక్కించిన 'ది వారియర్' కూడా డిసాస్టర్‌గానే నిలిచింది

Tags

Read MoreRead Less
Next Story