#DoubleISMART : ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్

#DoubleISMART : ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్

ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది.

వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో.

కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో 'డబుల్ ఇస్మార్ట్' లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్‌ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో "ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్' అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

"డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్!

వి ఆర్ బ్యాక్ !!

#డబుల్‌ఇస్మార్ట్ మోడ్ ఆన్! " అంటూ లాంచింగ్ ఈవెంట్ లో ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్

డబుల్ ఇస్మార్ట్ కోసం ఉస్తాద్ రామ్ పోతినేని సూపర్బ్ ట్రాన్స్ ఫర్మేషన్- రేపటి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం

కథ, క్యారెక్టర్ డిజైన్, మేకింగ్, స్కేల్, స్పాన్, బడ్జెట్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతిదీ ఇస్మార్ట్ శంకర్‌లో చూసిన దానికి రెట్టింపు ఉంటుంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.

డబుల్‌ ఇస్మార్ట్‌ లాంచింగ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. రేపటి నుంచి (జూలై 12) రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. ఈలోగ రామ్ త‌న క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యారు. తన ట్రాన్స్ ఫర్మేషన్ తో అందరినీ డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ లోకి వెళ్లనున్నారు రామ్ .

డబుల్ ఇంపాక్ట్ అందించడానికి రామ్ ఇస్మార్ట్ శంకర్‌గా బంగర్ అవతార్‌కి తిరిగి వచ్చారు. ఈ పాత్ర కోసం చిన్న, స్పైక్డ్ హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రీక్వెల్ అతని మెదడులో చొప్పించిన చిప్‌ను చూపించింది. తల వెనుక భాగంలో ఉన్న కట్ సూచించినట్లుగా డబుల్ ఇస్మార్ట్ డబుల్ రేంజ్‌లో వుంటుందని అర్ధమౌతుంది. ఇది క్యూరియాసిటీని డబుల్ చేస్తోంది.

పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగి కథ రాశారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్‌ని ఇస్మార్ట్ శంకర్ కంటే మాసియర్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్.

డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.

Tags

Read MoreRead Less
Next Story