అతిక్, అష్రఫ్ ల హత్య.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

X
By - Vijayanand |19 April 2023 2:14 PM IST
గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలో అప్రమత్తంగా లేరన్న కారణంగా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. ఇందుకుగాను బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. MLN పోలీస్టేషన్ పరిధిలో హత్య జరిగినట్లు తెలిపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ లను ఏప్రిల్ 16న ప్రయాగ్ రాజ్ లో కాల్చిచంపారు. జర్నలిస్ట్ లమంటూ వచ్చిన ముగ్గురు దుండగులు కాల్చిచంపారు. వీరు హమీపూర్ కు చెందిన సన్నీ సింగ్ (23), బండాకు చెందిన లవ్లేష్ తివారి (22), కాస్గంజ్కు చెందిన అరుణ్ మౌర్య (18). వీరిని ఏప్రిల్ 23 వరకు పోలీసు రిమాండ్కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com