Twitter : సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్

సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. దేశంలోని సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది. నిజమైన సెలబ్రిటీల ఖాతాలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ బ్లూటిక్ను.. నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే కేటాయిస్తోంది ట్విట్టర్. సాధారణ యూజర్లు సైతం బ్లూటిక్ పొందేలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూపొందించింది.అలాగే డబ్బులు చెల్లించనివారికి టిక్ మార్క్ను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెటర్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, విజయ్, శింబు లాంటి స్టార్ సెలబ్రిటీల ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ కనిపించడం లేదు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ఇలా చాలా మంది ప్రముఖులు తమ బ్లూ టిక్ను కోల్పోయారు. అయితే మంత్రి కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణుల ఖాతాలకు మాత్రం బ్లూ టిక్లు కనిపిస్తున్నాయి. మరోవైపు సెలబ్రిటీలను వెరిఫై చేసి ఈ బ్లూ టిక్ మార్క్ ఇచ్చేవారు. పొలిటికల్ లీడర్లు, స్పోర్ట్స్ స్టార్లు, జర్నలిస్టులు,సెలబ్రిటీను ఈజీగా గుర్తించేందుకు ఈ వెరిఫికేషన్ ను వాడుతారు.ఇక బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ కోసం ట్విట్టర్ యూజర్లు నెలకు 650 రూపాయలు, ఏడాదికైతే 6వేల500ల ఆఫర్ను ట్విట్టర్ అందిస్తోంది. నిన్నటి లోపల బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోనివారు బ్లూటిక్ కోల్పోతారని ప్రకటించింది ట్విట్టర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com