కేరళలో తొలి వందే భారత్..పచ్చజెండా ఊపిన ప్రధాని

X
By - Subba Reddy |25 April 2023 12:45 PM IST
వందేభారత్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు
కేరళలో తొలి వందే భారత్ రైలుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. వందేభారత్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కసరగడ్ నుంచి తిరువనంతపురం వరకు వెళ్లే ఈ వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులు తిరగనుంది. 11 జిల్లాల మీదుగా మొత్తం 586 కిలోమీటర్ల ప్రయాణం సాగించనుంది. అటు వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. అనంతరం విద్య, పరీక్షలు, డ్రాయింగ్ సహా ఇతర సాంకేతిక అంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోదీ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com