అంగరంగ వైభవంగా కేరళ త్రిసూర్‌ పురం వేడుకలు

అంగరంగ వైభవంగా కేరళ త్రిసూర్‌ పురం వేడుకలు
వడక్కునాథన్‌ ఆలయం వేదికగా ఈ ఉత్సవాలు జరిగాయి. వడక్కునాథన్‌ అంటే శివుడి ఆలయంలోనే అయినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల దేవీదేవతలందరూ ఇందులో పాలుపంచుకున్నారు

కేరళలోని త్రిసూర్‌లో పురం వేడుకలు వైభవంగా జరిగాయి. వడక్కునాథన్‌ ఆలయం వేదికగా ఈ ఉత్సవాలు జరిగాయి. వడక్కునాథన్‌ అంటే శివుడి ఆలయంలోనే అయినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల దేవీదేవతలందరూ ఇందులో పాలుపంచుకున్నారు. పది గ్రామాల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏనుగులపై ఊరేగాయి. ప్రత్యేక పూజలు అనంతరం... ఆలయం సమీపంలోని థెక్కిన్‌కాడు మైదానంలో అంగరంగ వైభవంగా “పూరం” పర్వం జరిగింది. సంప్రదాయాలు. ఆచారాలకు పెద్దపీట వేసే కేరళలోని అన్ని ఆలయాలలో ఇలాంటి వేడుకలు జరుగుతాయి. కానీ, త్రిసూర్‌లోని జరిగే పూరంకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంతగొప్ప పూరం మరెక్కడా జరగదు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి... స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

Tags

Next Story