తీవ్రమౌతున్న రెజ్లర్ల ఆందోళన

తీవ్రమౌతున్న రెజ్లర్ల ఆందోళన
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ, రెజ్లర్లు చేస్తున్న ఆందోళన తీవ్రమవుతోంది. రెజ్లర్లు, వారి మద్దతుదారులు నల్ల రిబ్బన్లు కట్టుకుని ‘బ్లాక్‌ డే’గా పేర్కొంటూ నిరసన తెలియజేశారు. 18వ రోజు ఆందోళనలో స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, సత్యవ్రత్‌ కైద్యాన్‌, జితేందర్‌ కిన్హా , నుదుటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తంజేశారు. రెజ్లర్ల మద్దతుదారులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. ‘‘బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ‘బ్లాక్‌ డే’ పాటిస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story