తీవ్ర ఇబ్బందుల్లో చార్ధామ్ యాత్రికులు

X
By - Subba Reddy |3 May 2023 12:30 PM IST
కేదార్లో మంచు కురవడంతో చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
కేదార్లో మంచు కురవడంతో చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఇప్పటికే కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. భారీగా మంచు కురవడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సైన్యం కూడా రంగంలోకి దిగి రహదారి వెవండి మంచును తొలగిస్తోంది. మంచులో చిక్కుకున్న యాత్రికులను కాపాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు లేవు. అయితే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి చార్ధామ్ యాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com