UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
X
10 మంది మృతి, 27 మందికి గాయాలు

ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును ఒక వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం ఘజియాబాద్ నుంచి సంభాల్ వెళ్తున్న పికప్ వ్యాన్ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. బుదౌన్-మీరట్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా 27 మంది గాయపడ్డారు. వ్యాన్ పూర్తిగా ధ్వంసం కాగా బస్సు ముందు భాగం దెబ్బతిన్నది.

కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags

Next Story