Karnataka: పెళ్లి భోజనంతో 150 మంది ఆసుపత్రి పాలు

Karnataka: పెళ్లి భోజనంతో 150 మంది ఆసుపత్రి పాలు
రంగంలోకి దిగిన ఫుడ్ డిపార్ట్మెంట్

పెళ్లి అనగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరువాత మాట్లాడేది భోజనాల గురించే. అయితే శుభకార్యం జరిగిన పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భోజనాలు తిని 150 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెలగావిలో జరిగింది.

జిల్లాలో హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. బంధు, మిత్రులతో పాటు గ్రామంలోని చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు హాజరైన 150 మంది భోజనం చేసిన రెండు గంటల తరువాత అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేపించారు. డీ హైడ్రేషన్ వల్ల ఇలా జరిగిందని మొదట భావించారు. అయితే తరువాత భోజనాలు మీద అనుమానం వచ్చినట్టు విస్తున్నట్లు అధికారులు తెలిపారు. వంట పదార్థాలను, అలాగే వాటర్ ని కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స అందించడం కోసం గ్రామంలోని ఎమర్జెన్సీ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు తినడం వల్ల అస్వస్థతకు గురైన వారందరూ మొదట బెలగావిలో ఉన్న హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు.


మొదట కొంత మంది చేరగా తరువాత ఒక్కోరు పెరుగుతూ ఉండటంతో హాస్పటల్ సిబ్బంది ఎమర్జెన్సీగా కేసుగా భావించి వారికి చికిత్స అందించారు. దీనికి సంబంధించి అధికారులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు పెళ్లివేడుక జరిగిన చోటుకు వెళ్లి తనిఖీలు చేశారు. ఫుడ్స్ శాంపిల్స్, నీటి నమూనాలను తీసుకొని వాటిని ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వచ్చిన తరువాత వంటలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అయితే ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఇక గ్రామంలో ఏకంగా 150 మంది అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలోని ఒక స్కూల్ లో ఎమర్జెనీ క్లినిక్ ను అధికారులు ఏర్పాటు చేసి బాధితులకు ప్రత్యేక చికిత్స అందించారు.

Tags

Read MoreRead Less
Next Story