Mizoram: రైల్వే వంతెన కూలి 17 మంది మృతి

Mizoram: రైల్వే వంతెన కూలి 17 మంది మృతి
శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం

మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలిపోయింది. దీంతో 17 మంది కార్మీకులు అక్కడికక్కడే చనిపోయారు. కూలిన శిథిలాల కింద చిక్కుకుని మరికొంతమంది చనిపోయే అవకాశం ఉందని, దీంతో మృతుల సంఖ్య పెరగనుందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐజ్వాల్ కు సుమారు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఓ రైల్వే వంతెన నిర్మాణంలో ఉంది. ఎప్పట్లాగే బుధవారం నిర్మాణ పనులు మొదలయాయి. అయితే సరిగ్గా ఉదయం పది గంటల ప్రాంతంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది ఆ సమయంలో సుమారు 35 నుంచి 40 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదంలో చనిపోయిన 17 మంది కార్మికుల మృతదేహాలను ఇప్పటికే వెలికి తీసినట్లు చెప్పారు. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంపై మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా స్పందించారు. వంతెన కూలిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story