Lok Sabha Polls: 2024 ఎన్నికలు అత్యంత కాస్ట్‌లీ ఎన్నికలు

Lok Sabha Polls: 2024 ఎన్నికలు  అత్యంత కాస్ట్‌లీ ఎన్నికలు
ఎలెక్షన్ ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు..

2024 లోక్‌సభ ఎన్నికలు..ప్రపంచంలోనే ఇప్పటివరకు జరిగిన వాటి కంటే అత్యంత ఖరీదైనవిగా రికార్డ్‌లకెక్కనున్నాయి. ఈసారి ఎన్నికల వ్యయం లక్షా 35వేల కోట్లకు చేరనుందని...విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం 2019 ఎన్నికల వ్యయంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ కావటమే కాకుండా...2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం కంటే అధికమని సమాచారం. రాజకీయాల్లో భావజాలం కంటే ధనబల ప్రభావం పెరుగుతున్నట్లు...విశ్లేషకులు అంచనా వేశారు.

దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గత రికార్డ్‌లను బద్ధలుకొట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయి. ఈసారి ఎన్నికల వ్యయం లక్షా 35 వేల కోట్లకు చేరనుంది. ఇది 2019ఎన్నికల వ్యయం 60వేల కోట్లతో పోలిస్తే...రెట్టింపు కంటే ఎక్కువ కానుందని సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌-CMS ఛైర్మన్‌ ఎన్.భాస్కరరావు అంచనా వేశారు. 35ఏళ్ల నుంచి ఆయన ఎన్నికల వ్యయాన్ని అంచనా చేస్తున్నారు. లక్షా 35 వేల కోట్ల వ్యయంలో...రాజకీయ పార్టీలు, సంస్థలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసే ఖర్చులన్నీ కలిసి ఉంటాయని...CMS ఛైర్మన్‌ తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలో మూడోసారి అధికారం చేపట్టాలని ఎన్డీయే భావిస్తుండగా...ప్రచారవ్యయంలో భారతీయ జనతా పార్టీది...పైచేయిగా కనిపిస్తోంది.

18వ లోక్‌సభ ఎన్నికల వ్యయాన్ని తొలుత లక్షా 20వేల కోట్లుగా అంచనా వేసిన CMSఛైర్మన్‌ ఎన్‌.భాస్కరరావు...ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం బయటపడటం, అన్ని వ్యయాలను లెక్కించిన తర్వాత లక్షా 35 వేల కోట్లుగా సవరించినట్లు చెప్పారు. పోలింగ్‌ తేదీల ప్రకటనకు మూడు-నాలుగు నెలలముందు వేసిన అంచనాలను ఈ సవరణ కవర్‌ చేసింది. ఎలక్టోరల్‌ బాండ్లు కాకుండా వేర్వేరు మార్గాల ద్వారా ఎన్నికల ప్రక్రియలోకి ధన ప్రవాహం కొనసాగినట్లు చెప్పారు. దేశంలో రాజకీయ విరాళాలకు సంబంధించి పారదర్శకత లేదని... ఇదివరకే ADR తెలిపింది. 2004-05 నుంచి 2022-23 వరకు దేశంలోని 6ప్రధాన రాజకీయ పార్టీలకు 19వేల 83 వేల విరాళాలు అందగా...అందులో 60 శాతం నిధులు ఎన్నికల బాండ్లు సహా గుప్తమార్గాల నుంచి అందినట్లు ADR అంచనా వేసింది.

అంచనా వేసిన లక్షా 35వేల కోట్ల ఎన్నికల వ్యయంలో...ఎన్నికల సంఘం బడ్జెట్‌ 10నుంచి 15 శాతం మాత్రమే అని... CMS ఛైర్మన్‌ ఎన్‌.భాస్కరరావు తెలిపారు. దేశంలో 96.6కోట్ల మంది ఓటర్లు ఉండగా...ఒక్కో ఓటర్‌పై దాదాపు పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లక్షా 20 వేల కోట్ల వ్యయం కాగా...ఈ ఎన్నికల ఖర్చు ఆ మొత్తాన్ని దాటిపోనుంది. వేర్వేరు వేదికలపై మీడియా ప్రచారానికి అయ్యే ఖర్చు...ఎన్నికల వ్యయంలో 30శాతం వరకు ఉంటుందని ...CMS ఛైర్మన్‌ ఎన్‌.భాస్కరరావు అంచనా వేశారు. 45రోజుల ప్రచారకాలంలో అంచనా వ్యయం కంటే వాస్తవంగా ఖర్చు చేసే మొత్తం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి ఈసీ విధించిన ఆంక్షలను అధిమించే మార్గాలను పార్టీలు, అభ్యర్థులు అన్వేషిస్తాయన్నారు. 2019లో ఎన్నికల వ్యయం 60వేల కోట్లు కాగా...అందులో భాజపా వాటా 45 శాతంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఆ మొత్తం పెరుగుతుందన్నారు. దేశ రాజకీయాల్లో భావజాలం కంటే ధనబల ప్రభావం అంతకంతకూ పెరుగుతున్నట్లు ఆయన పేర్కొనటం విశేషం

Tags

Read MoreRead Less
Next Story