Jammu Encounter : జమ్ములో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

Jammu Encounter : జమ్ములో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Jammu Encounter : షోపియాన్​లోని డ్రాచ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు స్థానిక టెర్రరిస్ట్‌లు మరణించారు

Jammu Kashmir : షోపియాన్​లోని డ్రాచ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు స్థానిక టెర్రరిస్ట్‌లు మరణించారు. వీరిలో ఇద్దరిని హనన్​ బిన్ యాకూబ్, జంషెద్​గా గుర్తించారు. పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో అక్టోబర్​ 2న జమ్ముకశ్మీర్​పోలీసు జావెద్ దర్​ను, సెప్టెంబర్​ 24న పుల్వామాలో బంగాల్​నుంచి వలస వచ్చిన కూలీని కాల్చి చంపిన కేసుల్లో యాకూబ్, జంషెద్ నిందితులని పోలీసులు తెలిపారు మరోవైపు.. మోలూలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులు,భద్రతా దళాలకు చెందినకమాండోలతో కలసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రాచ్​లో ఓ ఇంట్లో దాక్కుని ఉన్న ఉగ్రవాది కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది కౌంటర్‌ ఇచ్చాయి.ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు చనిపోయారు.

మరోవైపు జమ్ముకశ్మీర్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ చంద్ర షా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే మరో వైపు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకర్ని.. దక్షిణ కశ్మీర్​షోపియాన్ జిల్లాలోని మోలూ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. జైషే మహ్మద్ కు చెందిన మరో ముగ్గుర్ని డ్రాచ్ ప్రాంతంలో హతమార్చారు.

Tags

Read MoreRead Less
Next Story