Chhattisgarh: భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు, ఆరుగురు మావోయిస్టులు హతం!

X
By - jyotsna |20 Dec 2023 12:00 PM IST
ఛత్తీస్ ఘడ్ లోని మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సుక్మాజిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిథిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇందులో భారీ మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భద్రతాబలగాలు ఆరుగురు మావోయిస్టులు హతం అయినట్టు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం. సుక్మా జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించినట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, వస్తు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com