Bus Accident: గంగోత్రి వద్ద ఘోర ప్రమాదం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై 33 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో గంగోత్రి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన 22 మందిని అధికారులు రక్షించారు. బాధితులంతా గుజరాత్ కు చెందిన వాళ్లుగా తెలుస్తోంది.
క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుజరాత్ పర్యటకులతో వచ్చిన ఆ బస్సు.. గంగోత్రీ దామ్ నుంచి ఉత్తరకాశీ వైపుగా వెళ్తోండగా ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిన బస్సు నుంచి, స్థానికుల సాయంతో 27 మంది ప్రయాణికులను కాపాడారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్టు గుర్తించారు. బస్సు శకలాల కింద చిక్కుకున్న ఒక్కో ప్రయాణికుడిని కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతాపం తెలియజేశారు. ఈ ఘటన నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఉత్తరాఖండ్ సర్కారుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com