Rajya Sabha: ముగియనున్న 72 మంది ఎంపీల పదవీకాలం.. రాజ్యసభ నుండి వీడ్కోలు..

Rajya Sabha: ముగియనున్న 72 మంది ఎంపీల పదవీకాలం.. రాజ్యసభ నుండి వీడ్కోలు..
Rajya Sabha: రాజ్యసభలో ఇవాల్టితో 72 మంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది.

Rajya Sabha: రాజ్యసభలో ఇవాల్టితో 72 మంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దు చేశారు. రోజంతా పదవీ విరమణ సభ్యుల ప్రసంగాలు కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, విజయ సాయి రెడ్డి పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ నుంచి డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ విరమణ చేయనున్నారు. వీరందరికి సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్య తన నివాసంలో విందు ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story