Karnataka: చెరువు కట్టపై వెళ్తుండగా అదుపు తప్పిన బస్సు.. 8 మంది అక్కడికక్కడే మృతి..

Karnataka: చెరువు కట్టపై వెళ్తుండగా అదుపు తప్పిన బస్సు.. 8 మంది అక్కడికక్కడే మృతి..
Karnataka: ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Karnataka: ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌వీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో.. 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులు బస్సుకింద చిక్కుకోవడంతో.. వారిని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. చెరువు కట్టపై వెళ్తుండగా అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో కొందరు బస్‌ టాప్‌పై కూర్చున్నారు. బస్సులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కాలేజీ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. వైఎన్‌ హోసకోట నుంచి పావగడ వెళ్తుండగా.. బస్సు పావడ పలవలహళ్లి దగ్గర ప్రమాదానికి గురైంది.

Tags

Read MoreRead Less
Next Story