Delhi: బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు

సర్జరీ తరువాత 14 ఏండ్ల బాలుడి మృతి

బ్యాటరీలు, బ్లేడ్లు, స్క్రూలు వంటి 65 వస్తువులను మింగిన ఓ బాలుడు(14) క్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగిన కొన్ని గంటలకే మృతి చెందాడు. గత నెల 28న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ దవాఖానలో ఈ ఘటన జరిగింది. పేగు ఇన్‌ఫెక్షన్‌ వల్ల బాలుడు మృతి చెందాడని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. హాథ్రస్‌లో నివసించే బాలుడికి గత నెల 13న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆగ్రాలోని ఓ ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆ తర్వాత అది నయమైనా, కడుపు నొప్పి తలెత్తడంతో సరైన చికిత్స కోసం నాలుగు నగరాలు తిరిగారు. చివరకు ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ దవాఖానలో చేసిన స్కానింగ్‌లో అతడి పొట్టలో 57 వస్తువులు గుర్తించి ఆపరేషన్‌ నిర్వహించారు.

హత్రాస్‌కు చెందిన సంచిత్ శర్మ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడి పేరు.. ఆదిత్య. 15 ఏళ్ల వయస్సున్న ఈ బాలుడు స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఒకరోజు ఆదిత్యకి కడుపునొప్పి రావడంతో అతని తండ్రి హత్రాస్‌లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు అతన్ని జైపూర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాసేపు కోలుకున్నట్లు కనిపించిన బాలుడు.. నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి ఆవరణలోనే తీవ్రమైన కడుపునొప్పితో విలవిలాడిపోయాడు.

హుటాహుటీన కుటుంబసభ్యులు అతన్ని అలీగఢ్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు.. అల్ట్రాసౌండ్ టెస్టులు చేశారు. ఆ రిపోర్టులు చూశాక ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అతని శరీరంలో దాదాపు 19 వస్తువులు ఉన్నట్లు తేలింది. దాంతో వారు అతన్ని నోయిడాలోని అధునాతన సదుపాయాలున్న మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. నోయిడా ఆస్పత్రికి వెళ్లాక అతనికి మరొక స్కాన్‌ నిర్వహించగా.. 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది.

వెంటనే బాలుడిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గత నెల(అక్టోబర్) 27న శస్త్రచికిత్స చేశారు. 8 మంది సభ్యులు గల వైద్య బృందం ఎన్నో గంటల పాటు శ్రమించి అతని కడుపులోకి 57 వస్తువులను తొలగించారు. వీటిలో బ్యాటరీలు, బ్లేడ్‌లు, గోర్లు సహా కొన్ని విదేశీ వస్తువులు ఉన్నాయి. ఎలాగోలా శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలుడు ఆ సమయంలో ప్రాణాలతో బయటపట్టాడు.

ఈ సర్జరీ జరిగిన మరుసటి రోజే బాలుడు ప్రాణాలు వదిలాడు. శస్త్రచికిత్స అనంతరం బాలుడి గుండె వేగం అమాంతం పెరిగిపోవడంతోపాటు బీపీ కనిష్టస్థాయికి పడిపోయినట్లు బాలుడి తండ్రి తెలిపారు. కొడుకు కళ్లముందే ప్రాణాలు వదిలాడని చెప్తూ మృతుని తండ్రి కంటతడి పెట్టుకున్నారు. తన కొడుకును బ్రతికించేందుకు డాక్టర్లు ఎంతో శ్రమించారని.. కానీ, తన బిడ్డ విధి రాత బాగోలేదని వాపోయారు.

Tags

Next Story