Kerala Kottayam: అప్పటివరకు పెయింటర్.. ఉన్నట్టుండి కోటీశ్వరుడు.. ఏకంగా రూ. 12 కోట్లు..

Kerala Kottayam: అప్పటివరకు పెయింటర్.. ఉన్నట్టుండి కోటీశ్వరుడు.. ఏకంగా రూ. 12 కోట్లు..
Kerala Kottayam: కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్.. ఓ పెయింటర్.

Kerala Kottayam: అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టం ఓ టికెట్ రూపంలో వస్తే.. అదే లాటరీ. ఈ లాటరీ అనేది ఎక్కువగా ఆశించేవారికంటే టైమ్ పాస్‌కు కొనేవారినే ఎక్కువగా వరిస్తూ ఉంటుంది. ఈ లాటరీ అనేది ఇప్పటికీ ఎంతోమంది రిక్షావాలాలను, డ్రైవర్‌లను కోటీశ్వరులను చేసింది. తాజాగా కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిగా మార్చింది ఒక లాటరీ టికెట్.

కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్.. ఓ పెయింటర్. అతడికి రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. తాజాగా అతడు కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. అయితే ఈసారి మాత్రం తాను లాటరీ టికెట్‌ను కావాలని కొనలేదని చెప్తున్నాడు సదానందన్.

ఒకరోజు తాను ఓ షాపుకు వెళ్తుండగా తన దగ్గర ఉన్న రూ. 500 నోటుకు చిల్లర కోసం ఒక లాటరీ టికెట్‌ను కొన్నాడట సదానందన్. ఆ రోజు మధ్యానానికే రిజల్ట్స్ వచ్చాయని, అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. సదానందన్‌కు సనీష్, సంజయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాటరీలో వచ్చిన రూ. 12 కోట్లతో తాను ఒక మంచి ఇల్లు కట్టుకోవడంతో పాటు తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు సదానందన్.

Tags

Read MoreRead Less
Next Story