అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు మృతి, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు

X
By - Prasanna |5 Jan 2026 1:21 PM IST
కృష్ణ కిషోర్ దశాబ్ద కాలంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు దంపతులు మృతి చెందగా, వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిషోర్ (45), అతని భార్య ఆశా (40)గా గుర్తించారు. వాషింగ్టన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రగాయాలతో వారి కుమార్తె, కుమారుడు ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. విషాదం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించబడింది.
కృష్ణ కిషోర్ దశాబ్ద కాలంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ జంట 10 రోజుల క్రితం పాలకొల్లు సందర్శించారు. దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న తర్వాత అమెరికాకు తిరిగి వచ్చారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

