జమ్మూ-శ్రీనగర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. స్కార్పియో కారు ఢీకొని సీబీఐ న్యాయవాది మృతి

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొన్న ప్రమాదంలో 35 ఏళ్ల సీబీఐ న్యాయవాది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు. బనిహాల్ సమీపంలో న్యాయవాది కారును వెనుక నుండి వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాధితుడు షేక్ ఆదిల్ నబీ ఇటీవలే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ప్రాసిక్యూటింగ్ అధికారిగా నియమితులయ్యారు. ఈ ప్రమాదంలో ఆదిల్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే బనిహాల్ లోని సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (SDH) కు తరలించారు. అక్కడ అతనికి అత్యవసర ప్రథమ చికిత్స అందించారు. అయినా అతడికి గాయాలు తీవ్రం కావడంతో ప్రాణాలు కోల్పోయారు.
"పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న ఆదిల్ షేక్, చండీగఢ్లోని సిబిఐలో రెండు నెలల క్రితం నియమితులయ్యారు, ఈ ప్రమాదంలో గాయపడ్డారు" అని రాంబన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ్ గుప్తా తెలిపారు. ఈ ఘటనలో మహీంద్రా స్కార్పియో డ్రైవర్ మహ్మద్ షఫీని పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ఆదిల్ ఇటీవలే తన యుపిఎస్సి పరీక్షను ఉత్తీర్ణుడయ్యాడు. చండీగఢ్లోని అత్యున్నత దర్యాప్తు సంస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితుడయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

