Karnataka: భర్త తిట్టాడని మూగ కుమారుడిని.. ముసళ్ల కాలువలో విసిరేసిన తల్లి

X
By - jyotsna |6 May 2024 8:15 AM IST
కర్ణాటకలో దారుణం
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో తల్లిదండ్రుల మధ్య ఘర్షణ ఆరేళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. జన్మతః మూగవాడైన ఈ బాలుడిని కన్న తల్లి సావిత్రి మొసళ్లు ఉన్న కాలువలో విసిరేసింది. ‘మూగవాడిని ఎందుకు కన్నావు?’ అంటూ తరచూ భార్యను భర్త రవి కుమార్ వేధిస్తూ ఉండేవాడు. ‘వాడిని పారేయ్’ అని అనేవాడు. శనివారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె తన కొడుకును తీసుకెళ్లి, కాలువలోకి విసిరేసింది. పోలీసు లు ఆదివారం బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై తీవ్రమైన గాయాలు, మొసలి కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఓ చెయ్యి కనిపించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

