యూట్యూబ్ చూసి, ఫిట్ నెస్ కోసం ట్రై చేసి.. ప్రాణాలు పోగొట్టుకున్న యువతి

యూట్యూబ్ చూసి, ఫిట్ నెస్ కోసం ట్రై చేసి.. ప్రాణాలు పోగొట్టుకున్న యువతి
X
మూడు పూటలా అన్నం తిని ఆరోగ్యంగా ఉండే పిల్ల ఆ మాయదారి యూట్యూబ్ చూసి కడుపు మాడ్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.

మూడు పూటలా అన్నం తిని ఆరోగ్యంగా ఉండే పిల్ల ఆ మాయదారి యూట్యూబ్ చూసి కడుపు మాడ్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.

కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి, యూట్యూబ్‌లో బరువు తగ్గించే ఆహారం వాటర్ డైట్ తీసుకున్న తర్వాత విషాదకరంగా మరణించింది. కూతుపరంభకు చెందిన శ్రీనంద అనే యువతి, తలస్సేరి కో-ఆపరేటివ్ హాస్పిటల్‌లో కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది.

ఆమెకు చికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది, దీని వలన ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేది. దాంతో బరువు పెరిగి పోయింది. దానిని తగ్గించుకునేందుకు యూట్యూబ్ వీడియోలు చూసింది. అందులో అస్సలు ఏమీ తినకుండా ఒట్టి వాటర్ మాత్రమే తాగి బరువు తగ్గొచ్చు అనే వీడియో ఫాలో అయింది. "ఆమె ఆకలిగా ఉన్నా కడుపు మాడ్చుకుని వాటర్ డైట్ తీసుకుంటోంది. ఆరు నెలల క్రితం నుంచి ఈ డైట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పశ్చిమ దేశాలలో అనోరెక్సియా నెర్వోసా అనే వ్యాధి సర్వసాధారణం అయినప్పటికీ, కేరళలో ఇది చాలా అరుదు అని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ తెలిపారు.

ఈ పరిస్థితి ఆకలిని చంపుతుంది

అనోరెక్సియా నెర్వోసాతో బాధపడేవారు తరచుగా కాలక్రమేణా ఆకలి అనుభూతిని కోల్పోతారని డాక్టర్ నగేష్ వివరించారు. మాయో క్లినిక్ ప్రకారం, అనోరెక్సియా నెర్వోసా యొక్క కారణాలు తెలియవు. ఇది ఒక మానసిక అనారోగ్యం, జన్యు మార్పులు మరియు పర్యావరణ కారకాలు వంటి అంశాల మిశ్రమం ఈ పరిస్థితికి కారణమవుతుంది. ఇది స్పష్టంగా అన్ని లింగ గుర్తింపులు, జాతులు, వయస్సులు మరియు శరీర రకాలను కూడా ప్రభావితం చేస్తుంది. శ్రీనంద విషయంలో, సోడియం మరియు చక్కెర స్థాయిలు కూడా తగ్గుతున్నాయని, చికిత్స అందించిన తరువాత కూడా తగ్గుతూనే ఉన్నాయని డాక్టర్ వివరించారు.

అనోరెక్సియా నెర్వోసా అనేది పూర్తిగా తినే రుగ్మత కాదు. ఇది కూడా ఒక మానసిక పరిస్థితి, అందువల్ల, రోగి చాలా కాలం క్రితమే మానసిక చికిత్స తీసుకొని ఉండాలి అని డాక్టర్ నాగేష్ చెప్పారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, తినే రుగ్మత రకాన్ని బట్టి, దీనికి చికిత్సకు మానసిక చికిత్స, మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి కౌన్సెలింగ్ మరియు ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం. సకాలంలో చికిత్స చేస్తే కోలుకోవడం సాధ్యమవుతుంది. అయితే, అటువంటి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. ఒకరు ఎంతకాలం బాధపడ్డారో దానిని బట్టి కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. ఏది ఏమైనపప్పటికీ వైద్యులు సూచించిన ప్రకారం చికిత్స ప్రణాళికకు కట్టుబడి ఉండటం అవసరం అని చెప్పారు.

Tags

Next Story