ATM AC Theft : ఏటీఎంలో దొంగలు పడ్డారు... కానీ, పైసలు మాత్రం టచ్ చేయలేదు

ATM AC Theft : ఏటీఎంలో దొంగలు పడ్డారు... కానీ, పైసలు మాత్రం టచ్ చేయలేదు
ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన వింతఘటన

ఏటీఎంలో దొంగలు పడ్డారని హెడ్లైన్ చదివితే డబ్బులు దోచుకుని పోయి ఉంటారని మనమే ఒక కంక్లూజన్ కి వచ్చేస్తాం. ఇప్పుడు చెప్పబోయే సంఘటన వింటే ఇలాంటి దొంగతనం కూడా జరుగుతుందా అని మీకు అనిపించక మానదు. దొంగలు ‘ఏటీఎం’ మిషన్‌లను ఎత్తుకెళ్లడం కామన్. డబ్బుల కోసం ఏకంగా వాటిని పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్‌నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. కానీ ఓ ఇద్దరు దొంగలు ఏటీఎం మిషన్ ని అసలు ముట్టుకోకుండా అందులో ఉండే ఏసీ దొంగలించారు.ఇది వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ చూస్తే నమ్మక తప్పదు. దొంగలు ఏసీ ని దొంగలించడం అక్కడి సీసీటీవీలో రికార్డు అయింది.

పంజాబ్‌లో మోగా జిల్లాలోని బాఘ్ పట్టణం ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం ఈ చోరీ జరిగింది. ఏటీఎంలోకి ప్రవేశించారు ఇద్దరు దొంగలు. అందులో ఒకరు డస్ట్ బిన్ తిరిగేసి దానిమీద నిలబడి ఇండోర్ ఏసీ యూనిట్ వైర్లను కత్తిరించాడు.ఆ తరువాత మరొక వ్యక్తితో కలిసి ఏసీ ను కిందికి దించి ఎటువంటి భయం లేకుండా బైక్‌పై ఆ ఏసీ ని తీసుకెళ్లిపోయారు.





బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story