Mystery disease: ఛత్తీస్గఢ్లో వింత వ్యాధితో 13 మంది మృతి..

ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. బత్వాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 13 మంది ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశారు. ఎడతెరపి లేకుండా దగ్గు, ఛాతిలో నొప్పి లక్షణాలు మాత్రమే కనబడుతున్నాయి. అయితే ఈ మరణాలకు కారణమవుతున్న ఈ వ్యాధి ఏమిటో, దీని లక్షణాలు ఏమిటో ఇంతవరకు ఎలాంటి వివరాలు లభించ లేదని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తొలుత ఈ వ్యాధి జమ్ముకశ్మీర్లో, తర్వాత రాజస్థాన్లో విస్తరించి ప్రస్తుతం ఛత్తీస్గఢ్కు చేరుకుందని చెప్పారు. మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణం అయ్యిండొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు.
ఈ వ్యాధితో ఇప్పటికే 13మంది మరణించగా.. మరో 80మందికి ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు అధికారులు. అనుమానితుల నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపమని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు అధికారులు. అంతుచిక్కని వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు.
వ్యాధి లక్షణాలు:
ఈ వింత వ్యాధి బారిన పడ్డ బాధితులు ఛాతీ నొప్పి, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం కూడా క్షీణించిందని తెలిపారు అధికారులు. మహువా పంట సమయంతో పాటు వాతావరణంలో మార్పు, గ్రామస్తులు అడవుల్లోకి వెళ్లి రోజంతా మహువాను సేకరించటమే వ్యాధికి ప్రధాన కారణమని గ్రామంలో పర్యటిచిన ఆరోగ్య బృందాలు గుర్తిచాయని అన్నారు అధికారులు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మహువాను సేకరించడానికి అడవులకు వెళ్లాలని బాధితులు పట్టుబడుతున్న క్రమంలో వారికి ఓఆర్ఎస్ ఇచ్చి పంపుతున్నామని తెలిపారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com