300 సీట్లు గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం

X
By - Sathwik |24 Jun 2023 2:00 PM IST
మరోసారి నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి... 300 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన.. శ్రీనగర్లో బలిదాన్ స్మారకానికి శంకుస్థాపన
వచ్చే ఎన్నికల్లో 300 సీట్లను గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్న అమిత్ షా.. శ్రీనగర్లోని లాల్చౌక్లోని పర్తాప్ పార్క్ వద్ద బలిదాన్ స్మారకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సాంబా జిల్లాలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించింన అమిత్ షా.. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ CFSLకు శంకుస్థాపన చేశారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కూడా కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. రాజౌరి ఉగ్రదాడిలో మృతుల కుటుంబ సభ్యులను కలిసిన అమిత్ షా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com