అయోధ్య రాముడికి ప్రతి రోజూ గంట విశ్రాంతి: ప్రధాన పూజారి
అయోధ్యలోని రామమందిరాన్ని శుక్రవారం నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం గంటపాటు మూసివేస్తామని రామమందిరం ప్రధాన పూజారి తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెంచింది.
జనవరి 23వ తేదీ నుంచి ఉదయం 4 గంటలకు స్వామివారిని సుప్రభాత పూజల నిమిత్తం మేల్కొలుపుతారు. భక్తుల 'దర్శనానికి' సుమారు రెండు గంటల తరువాత అనుమతి లభిస్తుంది. ఇది రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది.
“శ్రీ రామ్ లల్లా ఐదేళ్ల బాలుడు. అతను చాలా గంటలు మెలకువగా ఉండడం వల్ల కలిగే ఒత్తిడిని భరించలేడు. కాబట్టి బాల రాముడికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి, ఆలయం యొక్క తలుపులు మధ్యాహ్నం 12:30 నుండి 1:30 గంటల వరకు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. తద్వారా దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు అని ఆలయ ప్రధాన పూజారి ”ఆచార్య సత్యేంద్ర దాస్ మీడియాకు వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com