NIIMS: యువకుడి ఛాతిలో బాణం.. ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు
ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. హైదరాబాద్ నిమ్స్కు రాగా వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు.
బీజాపూర్ జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన సోది నంద అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి సోమవారం అడవిలో వేటకెళ్లాడు. పొదల్లో ఉన్న అడవి పందిని చంపడానికి నంద స్నేహితుడు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ సమయంలో నంద అడవిపంది ఉన్న వైపు నిల్చొని ఉన్నాడు. అయితే స్నేహితుడు వదిలిన బాణం గురితప్పి నంద గుండెలోకి దూసుకెళ్లింది. గుండె, ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో తొలుత భద్రాచలం ఏరియా దవాఖానకు, తర్వాత వరంగల్లోని ఎంజీఎంకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి కుటుంబసభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపాల్ పరిశీలించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా అమరేశ్వర రావు మాట్లాడుతూ ‘అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన ఉండటంతో అర్ధరాత్రి అనస్తీషియా, గుండె, ఇతర సర్జరీ విభాగాలకు చెందిన వైద్యులను పిలిపించి శస్త్రచికిత్సను ప్రారంభించాం. 4 గంటల పాటు శ్రమించి గుండెకు ఉన్న గాయానికి చికిత్స చేస్తూ, ఊపిరితిత్తులకు పడిన రంధ్రాన్ని పూడ్చి అందు లో నిండిన రక్తాన్ని పూర్తిగా తొలగించాం. నంద ప్రస్తతం కోలుకుంటున్నాడు’ అని తెలిపారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప స్పందిస్తూ ‘బాధితుడు ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందినవాడు కావడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. స్పెషల్ కేసుగా పరిగణించి చికిత్సను ఉచితంగా అందిం చాం. ఈ ఆపరేషన్ను చాలెంజ్గా తీసుకొని రోగి ప్రాణాలను కాపాడిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేశ్వర రావు బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com