అవార్డుల ప్రదానోత్సవ సభలో ఘోరం 11 మంది మృతి,600 మంది అస్వస్థత

X
By - Subba Reddy |17 April 2023 11:15 AM IST
మధ్యాహ్నం నవీ ముంబైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ ఘోరం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అవార్డులను అందజేశారు
మహారాష్ట్రలో అవార్డుల ప్రదానోత్సవ సభలో అపశృతి చోటుచేసుకుంది. జనాలకు సన్స్ట్రోక్ తగిలింది. గుండెపోటుతో 11 మంది మృతి చెందారు. వడదెబ్బతో మరో 600 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న మిట్ట మధ్యాహ్నం నవీ ముంబైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ ఘోరం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అవార్డులను అందజేశారు. అయితే ప్రజలు భారీగా తరలి రాగా.. సభలో కనీసం టెంటు గానీ, పైకప్పు గానీ ఏర్పాటు చేయలేదు. దాంతో వచ్చిన జనం వడదెబ్బకు గురయ్యారు. అటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం షిండే పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com