Rahul Gandhi : 29వ రోజు ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర..

Rahul Gandhi : 29వ రోజు ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర..
Rahul Gandhi : కాంగ్రెస్ లీడర్‌ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర..29వ రోజు ఉత్సాహంగా సాగుతోంది

Rahul Gandhi : కాంగ్రెస్ లీడర్‌ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర..29వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. బ్రేక్ తర్వాత కొద్ది సేపటి క్రితమే తురువేకేరే నుంచి యాత్ర తిరిగి ప్రారంభమైంది. సాయంత్రం హరిదాసనహల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి తుమకూరు జిల్లా బనసంద్రలోని VSS జూనియర్ కాలేజీలో రాహుల్ బస చేయనున్నారు.

ఉదయం మాయసంద్ర నుంచి ఇవాల్టి పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం బ్రేక్‌ టైంలో స్థానికులతో మాట్లాడారు రాహుల్ గాంధీ. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ..కన్నడ భాష, సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రస్తావించారు. ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు.

సెప్టెంబర్‌ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ తమిళనాడు, కేరళలో భారత్‌ జోడో యాత్ర పూర్తయింది. మొత్తంగా 750 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తయింది. 150 రోజుల పాటు దాదాపు 12 రాష్ట్రాల మీదుగా జమ్ము కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర సాగనుంది. మొత్తం 3 వేల 500 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story