Supreme Court: బిల్కిస్ బానో కేసులో దోషులకు షాక్

Supreme Court: బిల్కిస్ బానో కేసులో దోషులకు  షాక్
ఆదివారం లోగా స‌రెండ‌ర్ కావాలంటూ సుప్రీం కోర్ట్ ఆదేశం

బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టేసింది. దోషులుగా ఉన్న 11 మందికి ఈ ఆదివారం లోగా అంద‌రూ స‌రెండ‌ర్ కావాల‌ని ఇవాళ అత్యున్న‌త న్యాయ స్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని కోర్టును ఆ దోషులు అభ్య‌ర్థించారు. అయితే వారి అభ్య‌ర్థ‌న‌ను కోర్టు కొట్టిపారేసింది. 2002 గోద్రా అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానోను రేప్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆ నిందితులు జైలుశిక్ష అనుభ‌వించారు. అయితే ఇటీవ‌ల క్ష‌మాభిక్ష ఆధారంగా వాళ్లు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

ఆ రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ కోర్టును ఆశ్ర‌యించారు. ఆమె అభ్య‌ర్థ‌న విన్న సుప్రీం.. దోషులు మ‌ళ్లీ స‌రెండర్ కావాల‌ని ఆదేశించింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ కోర్టుకెళ్లిన దోషుల‌కు చుక్కెదురైంది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న నేతృత్వంలోని బెంచ్ ఇవాళ తీర్పును ఇచ్చింది. పిటీష‌న‌ర్ల వాద‌న‌లో ప‌స లేద‌ని, దోషులు మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు పేర్కొంది.

ఈ కేసును పూర్తిగా పరిశీలించినట్లైతే.. 2002 లో జరిగిన గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణిగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు.. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని వారిని చిన్నా పెద్దా అని చూడకుండా ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 వ తేదీన జీవిత ఖైదు విధించింది. అయితే గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ 11 మంది దోషులకు రెమిషన్ పై విడుదల చేశారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ 11 మంది నిందితులు తిరిగి జైలుకు వెళ్లాల్సిదే.

Tags

Read MoreRead Less
Next Story