కారు, ట్రక్కు ఢీ.. బీజేడీ నేతకు తీవ్ర గాయాలు
ఒడిశాలోని సంబల్పూర్లో కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బీజేడీ నేత ప్రసన్న ఆచార్యకు తీవ్ర గాయాలయ్యాయి. భువనేశ్వర్ నుంచి సంబల్పూర్కు వెళ్తుండగా ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో బీజేడీ ఉపాధ్యక్షుడు ప్రసన్న ఆచార్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆచార్యను తదుపరి చికిత్స కోసం భువనేశ్వర్కు తరలిస్తారు. విచారణ నిమిత్తం లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
భువనేశ్వర్ నుంచి సంబల్పూర్కు వెళుతుండగా రైరాఖోల్లోని బలాదిహ్ సమీపంలో తెల్లవారుజామున ఒంటిగంటక ఈ ఘటన జరిగింది. సంబల్పూర్ ఎస్పీ ముఖేష్ భాము వారి పరిస్థితి నిలకడగా ఉందని ధృవీకరించారు. తదుపరి చికిత్స కోసం వారిని భువనేశ్వర్కు విమానంలో తరలించాలని యోచిస్తున్నారు. ఆచార్య తల, ముక్కు, గడ్డం, ఇతర శరీర భాగాలకు గాయాలైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్ను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆచార్య ప్రయాణిస్తున్న కారు ఆక్సిజన్తో కూడిన ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com