Assam : బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా.. విద్యార్ధులు గల్లంతు..

Assam : బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా.. విద్యార్ధులు గల్లంతు..
Assam : అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా కొట్టింది

Assam : అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా కొట్టింది. సంఘటన జరిగిన సమయంలో ఆ పడవలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు పడవలో ఉన్న వారిని రక్షించారు.

పడవ బాషానీకి వెళ్తుండగా అడబరి వద్ద బ్రిడ్జి పోస్ట్‌ను ఢీ కొట్టింది. ఓ ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. పది మోటర్ సైకిళ్లను సైతం ఎక్కించారని, ఇదే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story