Kerala Breaking: కన్నూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్‎పై బాంబు దాడి.. కార్యాలయం ధ్వంసం..!

Kerala Breaking: కన్నూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్‎పై బాంబు దాడి.. కార్యాలయం ధ్వంసం..!
Kerala Breaking: కేరళలో బాంబు దాడి కలకలం సృష్టించింది. కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.

కేరళలో బాంబు దాడి కలకలం సృష్టించింది. కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం కిటికీ అద్దాలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ దాడి జరిగడం అక్కడి శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. అయితే బాంబు దాడి కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అటు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పై బాంబు దాడిని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఇటువంటి దాడులను నిరోధించడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై కేరళ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లకు సమీపంలోనే దాడులు జరిగాయని.. అయినా పోలీసులు పట్టించుకోలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కన్నూర్ వంటి సున్నితమైన జిల్లాలో కార్యాలయాలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యమే కాదు పరోక్షంగా మద్దతు ప్రకటించడే అవుతుంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కార్యాలయానికి నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story