పంజాబ్‌ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ల కలకలం

పంజాబ్‌ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ల కలకలం
పాకిస్తాన్‌ నుంచి వచ్చిన మూడు డ్రోన్‌లను BSF బలగాలు కూల్చేశాయి

పంజాబ్‌ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌లు కలకలం రేపాయి. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మూడు డ్రోన్‌లను BSF బలగాలు కూల్చేశాయి. పంజాబ్‌ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గుండా అవి వేర్వేరు ప్రాంతాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. ఈ డ్రోన్లు అమృత్‌సర్‌ జిల్లాలోని ఉధర్‌ ధరివాల్‌, రత్తన్‌ఖుర్ద్‌ గ్రామాల పరిధిలో గుర్తించి కూల్చివేసినట్లు BSF అధికారులు తెలిపారు. ఓ డ్రోన్‌ పాకిస్థాన్‌ భూ భాగంలో పడిపోయినట్లు వెల్లడించారు. ఒక డ్రోన్‌లో 2.6 కిలోల బరువున్న రెండు ప్యాకెట్లు కనిపించాయి. వాటిలోని పదార్థాన్ని హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story