Aadhaar App: ఆధార్ కార్డ్ కష్టాలకు చెక్, ధ్రువీకరణకు యాప్

ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డునో లేక దాని జిరాక్స్ కాపీనో మనం వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఇక ఉండదు. గుర్తింపు ధ్రువీకరణను సురక్షితంగా, డిజిటల్గా, పేపర్ రహితంగా చేయడానికి రూపొందించిన ఆధార్ యాప్ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు. క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ముఖ ధ్రువీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉన్నాయి. 100 శాతం డిజిటల్ విధానంలో పనిచేస్తుంది కాబట్టి ఇక నుంచి వినియోగదారులు ఆధార్ ఫొటో కాపీలు, ప్లాస్టిక్ కార్డులు తమ వెంట తీసుకుని వెళ్లనక్కర్లేదు.
ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉన్న ఈ యాప్ను త్వరలోనే దేశమంతటా ప్రవేశపెడతారు. ఇది అమలులోకి వస్తే ఇక నుంచి ఎయిర్పోర్టులు, హోటళ్లు, ప్రభుత్వ సేవలు, ఇతర ప్రదేశాల్లో భౌతిక ఆధార్ కార్డులను ఐడీ ధ్రువీకరణగా చూపించాల్సిన అవసరం ఉండదు. స్కానింగ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణమే ఆధార్ ధ్రువీకరించుకోవచ్చు.
ఇకపై ప్రతిసారి మనతోపాటు మన ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సిన పనిలేదు. దీనికోసం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొత్త యాప్ ను ఆవిష్కరించారు. దీని ద్వారా క్యూఆర్ కోడ్ సహాయంతో తక్షణం వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. అంతేకాదు, ఈ యాప్ లో రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇకపోతే, ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే.. వ్యక్తిగత ధ్రువీకరణ పరిశీలించే చోట ఆధార్ కార్డు వద్ద ఓ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ సమయంలో మన ఆధార్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లయితే మీ ధ్రువీకరణ చాలా సులువుగా అయిపోతుంది. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిగా చాలా సులువుగా, సురక్షితంగా ఉంటుంది. ఈ యాప్ సంబంధించి బీటా పరీక్షలు ఒక్కసారి పూర్తయితే, దేశవ్యాప్తంగా ఈ ఫుల్ వర్షన్ అమలులోకి వస్తుందని మంత్రి తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com