Chhattisgarh: ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ లీడ్

ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో భాజపా ముందంజలో ఉంది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపా పాలనకు 2018లో తెరదించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐతే కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ సర్కారులో హోం మంత్రి సహా మరికొందరు మంత్రులు ఓటమి దిశగాసాగుతున్నారు. సీఎం భూపేశ్ బఘేల్ మాత్రం పటాన్ నియోజకవర్గం నుంచి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం, భాజపా అభ్యర్థి రమణ్సింగ్ రాజ్నంద్గావ్లో భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ భాజపా అధ్యక్షుడు అరుణ్ సావో..లోర్మీ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ వాటిని తారుమారు చేస్తూ బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. మొదటి రౌండ్ కౌంటింగ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోయినప్పటికీ క్రమంగా వెనకంజలో పడిపోయింది. అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ముందంజలో ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న భూపేష్ బఘెల్ వెనుకంజలో ఉన్నారు. ఈసారి ఫలితాలు ఎలా ఉండనున్నాయో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచిచూడాలి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. దీనికోసం 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.181 మంది అభ్యర్థుల బరిలో నిలువగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగల్ మరో సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కాంగ్రెస్ను ప్రజలు గద్దెదించేందుకు సిద్దమయ్యారని రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com