Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు సీఐడీ నోటీసులు

Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు సీఐడీ నోటీసులు
ఈ ఏడాది మొదట్లో కేసు నమోదు, ఖండించిన కర్ణాటక మాజీ సీఎం..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్పకు సీఐడీ బుధవారం నోటీసులిచ్చింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. బీజేపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఐడీ దర్యాప్తునకు హాజరవుతారని తెలుస్తున్నది.

17 ఏళ్ల మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలో కేసు నమోదైంది. చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి 2న యడియూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. యడియూరప్పపై పోక్సో యాక్ట్‌తో పాటు ఐపీసీలోని సెక్షన్ 354(ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యడియూరప్ప తన న్యాయవాదుల ద్వారా సీఐడీ ముందు హాజరు కావడానికి ఒక వారం పొడగింపు కావాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే విచారణ బృందం మూడుసార్లు విచారించింది, ప్రస్తుతం ఆయన నాలుగోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది.

తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కోసం సీఐడీకి బదిలీ చేశారు. అయితే, యడియూరప్ప మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు. నిరాధారమైనవిగా పేర్కొన్నారు. 81 ఏళ్ల యడియూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, మళ్లీ జూలై 2019-2021 వరకు సీఎంగా పనిచేశారు. 2021లో సీఎంగా రాజీనామా చేశారు.


Tags

Next Story