Congress: సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం..
By - Divya Reddy |28 Aug 2022 3:09 PM GMT
Congress: ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు సభ్యులు.
Congress: ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు సభ్యులు. సెప్టంబర్ 22న అధ్యక్ష ఎన్నికకు సంబందించి నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30వరకు నామినేషన్ల స్వీకరిస్తారు..ఇక అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.. అయితే ఈసారి గాంధీ కుటుంబేతర సభ్యులకు ఛాన్స్ ఉంటుందని రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత అశోక్ గెహ్లాట్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.. అయితే రాహుల్గాంధీని ఎలాగైనా ఒప్పిస్తామని సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే పట్టుబడుతున్నారు..మరోవైపు ప్రియాంక గాంధీ వైపు చూస్తున్నారు మరికొందరు సీనియర్లు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com